నాగారం లావణ్య రెసిడెన్సీ అపార్ట్మెంట్ అధ్వర్యంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ చేతులమీదుగా మహేశ్వర్ రెడ్డి కి సన్మానం
---బౌతిక శాస్త్రం లో సోడియం బ్యాటరిస్ పరిశోధన....
--ఉస్మానియా యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం.
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్ :
మేడ్చల్ జిల్లా నాగారం లావణ్య రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాస్తవ్యులు మహేశ్వర్ రెడ్డి భౌతిక శాస్త్రంలో సోడియం బ్యాటరీస్ పైన పరిశోధన చేసినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును ప్రకటించడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఘట్కేసర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.ఈ సందర్భంగా ఆదివారం రోజు సాయంత్రం లావణ్య రెసిడెన్సీ అపార్ట్మెంట్ తరుపునా , వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ చేతులా మీదుగా సన్మాన కర్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి నాగారం మున్సిపాలిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ మలేష్ యాదవ్ ,అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణా ప్రసాద్ అరుణ్ కుమార్ రెడ్డి, భారత్ మరియు
అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.

0 Comments