బిఆర్ఎస్ ప్రభుత్వం మరో మైలు రాయిని దాటి గృహలక్ష్మి పతకం పత్రాలు అందించినా మంత్రి మల్లారెడ్డి.
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్/
మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 20/బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గృహలక్ష్మి పథకం క్రింద నాగారం మున్సిపాలిటీ చెందిన (78) మందికి మొదటి విడతలో మంజూరు అయిన గృహ లక్ష్మి పథకం లబ్ధిదారులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్యులు చామకుర మల్లారెడ్డి చే ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం జరిగింది.కేసిఆర్ మాట ఇచ్చినా ప్రకారంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ముడులక్షల రూపాయలను విడతల వారీగా గృహలక్ష్మి పతకం ద్వారా ఇస్తూ సొంత ఇంటి కల ను కేసిఆర్ నెరవేర్చారు.సొంత ఇళ్లు లేని తెలంగాణను నిర్మించడమే కేసిఆర్ లక్ష్యం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్స్ పత్రాలను మంత్రి మల్లారెడ్డి , నాగారం చైర్మన్ చంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు , నాగారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శీను ,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments