Wanted Reporters

Wanted Reporters

మరోసారి రాజ్యాంగం మారస్తామనే చర్చ తెస్తే తీవ్ర నిరసన




హైదరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్: మరోసారి రాజ్యాంగం మారుస్తామనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తా అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఫ్యూడల్ ఆలోచనలు ఉన్న కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని యెద్దేవా చేశారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగం మార్పు చేస్తాం అంటున్నారని ఆయన మండిపడ్డారు. అప్రజాస్వామిక.. అరాచక పాలనను ఎదుర్కునేందుకు త్వరలోనే ప్లీనరీ నిర్వహించుకుని.. తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కూడబలుక్కుని విలాసాలు.. విందులకు ఖర్చు చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు.
బడ్జెట్ కరోనా తరువాత ఆర్థిక అసమానతలు పెంచేలా ఉందన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు బడ్జెట్ రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మనుషుల మధ్య అంతరాలు తొలగించేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుంది అని అంబేద్కర్ చెప్పారని టీజేఎస్ అధినేత గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంను తిడుగుతున్నట్టు కనిపించే కేసీఆర్ అదే పంథాను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మారాలని చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరని...ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా లాఠీ చార్జి చేశారన్నారు. ముఖ్యమంత్రికి చెప్పుకుందాం అని బయలుదేరితే మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన సాగర్ బాధితులను 144 సెక్షన్ పెట్టి లాఠీ ఛార్జ్ చేయించారని ఆరోపించారు. యువకులు ఉద్యోగాలు కోసం పోరాటం చేస్తే పట్టించుకోలేదన్నారు.
పీజీ.. పీహెచ్డీ చేసిన వారు ఖాళీగా ఉన్నారని తెలిపారు. 50 వేల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారని.. దానమా ధర్మమా అని ప్రశ్నించారు. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పటికీ బతుకుదేరువు లేక దబాయ్‌.. ముంబాయి పోయి అవస్థ పడుతున్నారన్నారు. కేసీఆర్ రాజ్యాంగం రాస్తా అంటే అది నిరంకుశ రాజ్యాంగం అయి ఉంటుందని విమర్శించారు. అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేసారని.. ఆ తప్పుని కప్పిపుచ్చు కోవడం కోసం స్థానికత అంటున్నారని మండిపడ్డారు. స్థానికతకు గుర్తింపు లేకుండా చేసేందుకే 317 జీవో అని అన్నారు. ఉద్యోగులు నీ సెక్యూరిటీ గార్డులు కాదు.. నీ ఫాం హౌస్‌లో కూలీలు కాదు అని అన్నారు. 317జీవో రాజ్యాంగ విరుద్ధమని.. ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని కోదండరాం వ్యాఖ్యలు చేశారు.. 

Post a Comment

0 Comments

Ad Code