* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, చింతమడక గ్రామంలో నూతనగృహా ప్రవేశాలకుహాజరైన :- మంత్రి హరీష్ రావు*
సిద్ధిపేట వాస్తవ తెలంగాణ న్యూస్ :- సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో 164 సామూహిక గృహా ప్రవేశాలలో హాజరైన మంత్రి హరీశ్ రావు ఎస్సీ లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. అంతకు ముందు చింతమడక గ్రామంలో దమ్మ చెరువు నుంచి నర్లేoగడ్డ వరకూ బీటీ రోడ్డు, అలాగే చింతమడక నుంచి రాఘవాపూర్ వయా సింగ చెరువు వరకూ బీటీ రోడ్డు, అదే విధంగా చింతమడక నుంచి చెల్లాపూర్- రాజక్కపేట వరకూ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు, గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన గృహా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు ,ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
చింతమడక గ్రామస్తులంతా ఎంత సంతోషంగా ఉన్నారో.. అంతే సంతోషంతో సీఎం కేసీఆర్ ఉంటారు అని మంత్రి హరీష్ రావు అన్నారు
చింతమడక గ్రామం ఐక్యతకు నిదర్శనం అని,ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఇవాళ చింతమడకలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలలో హాజరై ఇళ్లు చూస్తే కడుపు నిండినంత సంతోషంగా ఉందని,చింతమడక గ్రామ అభివృద్ధి ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది, సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో కొంత మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని మాట్లాడితే.. కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని అన్నారు,దేశ వ్యాప్తంగా పేదలకు హక్కులు దక్కడం లేదని, దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరంగా హక్కులు సంక్రమించాలని ,25 కోట్ల మంది దళిత జనాభా కలిగిన దేశంలో కేవలం 8 కోట్ల బడ్జెట్ పెట్టడం సరికాదని కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి హరీశ్ దుయ్యబట్టారు,తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే నేనే అంటుపెడ్తనని.. గతంలోనే అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు,కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి ప్రయివేటు కంపెనీలకు ఇస్తే..రిజర్వేషన్లు ఏలా వర్తిస్తాయని.. అలా అమ్మితే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ వస్తుందా..అంటూ రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు హక్కులు సంక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు,పులుల నుంచి మేకల్ని కాపాడాలని అంబేద్కర్ తెలిపినట్లు గుర్తు చేసి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెరగాలి. ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం అది సాధ్యమా.. అంటూ వివరించారు,ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన హక్కులు దక్కాలని సీఎం కేసీఆర్ చెప్పారని, అదానీ, అంబానీల సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా, అందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు,రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడ్డారు,బడ్జెట్లో ఎఫ్ఆర్బీఏం పరిమితి తగ్గించడంతోతెలంగాణకు 5 వేల కోట్ల కోత పడినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ వెల్లడి,నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయికాడ కరెంటు మీటర్లు పెట్టనని రైతు శ్రేయస్సు కై సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ బాయికాడ కరెంటు మీటర్లు పెడితేనే 5 వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర బీజేపీ మెలిక పెట్టిందని వివరిస్తూ.. మీటర్లు వద్దు.. బీజేపీ వద్దు.. మన కేసీఆరే మనకు ముద్దు అంటూ సభికులచేత అనిపించారు,బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపింది,బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టి, యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించాలని కోరారు,
దేశంలోనీ ఆర్మీ, నేవీ, సెంట్రల్ ఫోర్స్, రైల్వే, బ్యాంకింగ్ రంగ వివిధ సంస్థల్లో 15లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ విషయం పై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కేవలం 7.5 లక్షల ఉద్యోగాలే ఖాళీలు ఉన్నాయని చెప్పకనే తమ తప్పులు ఒప్పుకున్నారని, వెంటనే ఆ ఖాళీలు భర్తీ చేయించాలని బండికి మంత్రి సవాల్ విసిరి డిమాండ్ చేశారు,తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు, త్వరలోనే మిగతావి కూడా చేస్తామని అన్నారు
తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నది,బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్ష గట్టింది. సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదు అని మంత్రి హరీష్ రావు అన్నారు
0 Comments