*గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి*
*శ్రీమతి రోహిణి ప్రియదర్శి*
*గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి జిల్లా సిబ్బందికి ఆదేశాలు*
(మెదక్, వాస్తవ తెలంగాణ న్యూస్)
ఈ సందర్భంగా మెదక్ జిల్లా యెస్.పి
మాట్లాడుతూ గంజాయి ప్రదేశాలను గుర్తించాలని. గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారి ద్వారా గంజాయి ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలి. జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలి. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి వారానికి రెండు సార్లు వారికి కేటాయించిన గ్రామాలలో, వార్డుల్లో సందర్శించి ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుని గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు సేవించకుండా విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లాడ్జీలు, బస్టాండ్లు, కాలేజీలు, లేబర్ అడ్డాలు తదితర ప్రదేశాల పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లా సిబ్బంది పని చేయాలని సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు
మెదక్ జిల్లా పరిధిలో వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మనందరి ముందున్న లక్ష్యమని అన్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను నియంత్రణలో పూర్తిస్థాయిలో సమూలంగా నియంత్రించాలని తెలిపారు. మెదక్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం కోసం హోంగార్డు నుండి పై స్థాయి అధికారి వరకు కష్టపడాల్సి వుంటుందని. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడం, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందని. గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు తీసుకోవాలని సూచించారు.
గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో రివార్డు తగిన పారితోషకం మరియు మంచి గుర్తింపు లభిస్తుందని ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతం నియంత్రించే మార్గాలపై అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని, గంజాయి కట్టడకి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు.అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి పోలీస్ అధికారి నా స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి గంజాయి కేసులు నమోదు కాలేదని ఆలసత్వం ప్రదర్శించకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని, నేరం జరిగాక భాధపడే కన్నా నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవాలని, గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టివారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించారు.
*గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే మెదక్ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 7330671900 కి కానీ జిల్లా యెస్.పి గారి నంబర్ 8332911100 కి కానీ సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని జిల్లా యెస్.పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
0 Comments