*ఎమ్మెల్యేను కలిసిన ఛత్రపతి యూత్ సభ్యులు*
జిన్నారం, వాస్తవ తెలంగాణ న్యూస్:-
*జిన్నారం* గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మ గూడెం చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గరికి కరెంటు స్తంభాలు మరియు వీధిలైట్లు కావాలని ఎమ్మెల్యే *గూడెం మహిపాల్ రెడ్డి* గారిని, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *జిన్నారం వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి* కోరడం జరిగింది, ఆయన స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి స్తంభాలు , లైట్లు వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు గొర్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ గౌడ్, యువజన నాయకులు దుబ్బాక మహేష్ యాదవ్, గుర్రాల సత్యనారాయణ యాదవ్, రాజు యాదవ్, వెంకటేష్ యాదవ్, మహేష్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు
0 Comments