*కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ సంఖ్యను పెంచాలి*
*- బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి
*
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్29:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో దాదాపు 500 మందికి వరకు టెస్టులు నిర్వహించాలని మున్సిపల్ బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి వైద్యాధికారులను కోరారు. ఈ సందర్భంగా వైద్యులు స్పందిస్తూ దాదాపు రెండు ప్రక్రియల్లో 200 మంది మాత్రమే ఏం జరుగుతుంది టెస్టులు కూడా అంతే జరుగుతున్నాయని ఆయనతో పేర్కొన్నారు. ప్రభుత్వం సప్లై చేసిన వ్యాక్సిన్ బట్టి వైద్య సాయం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా టెస్టులు వ్యాక్సినేషన్ ప్రక్రియను లక్ష జనాభా ఉన్న బొల్లారంలో 500 వరకు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.

0 Comments