బీరప్ప దేవాలయానికి విరాళం --పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు
పటాన్చేరు తెలంగాణ సాక్షి:-
పటాన్చేరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఆలయానికి పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విరాళం ప్రకటించారు.పటాన్చెరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి బీరప్ప దేవాలయానికి తన వంతు సహాయంగా తమ వంతు సహాయం చేయాలని అభ్యర్థించిన గ్రామస్తులకు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రావు పనులను పరిశీలించి ,గుడికి సంబంధించిన బండలు మరియు గ్రానైట్ వేయించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ కుమార్ గారు, శివయ్య యాదవ్, భూపాల్ యాదవ్, యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments