తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ పోడిగింపు
హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం గతనెల 20 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది శుక్రవారంతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో ఉంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. వీటిన్నంటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నిర్ణయం ప్రకటించనున్నారు. తెలంగాణలో లాక్డౌన్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుండగా అదేమీలేదని హోంమంత్రి మహమూద్అలీ తెలపగా, ఇప్పటికైతే లాక్డౌన్ విధించే ఆలోచన లేదని వైద్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు

0 Comments