ఎన్.ఎం.ఎం యువ సేవ ఆధ్వర్యంలో కరోన బాధితులకు నిత్యావసర వస్తుల పంపిణీ
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్ 27:-
కరోనా బాధితులకు అండగా మేమున్నామంటూ కొండంత ధైర్యాన్ని అందించేందుకు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్. ఎం .ఎం యువసేన ఆద్వర్యం లో కరోన బాధితులు లకు నిత్యావసర వస్తులను ఊట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులు జిన్నారం మండల ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు సుంకరబోయిన మహేష్ లు జిన్నారం మండలంలోని ఊట్ల, దాదిగూడ గ్రామంలో ఈ రోజు కరోన రోగులకు సానిటీజర్ ,మాస్క్ బియ్యం ,గుడ్లు ట్రే లు , టమాటలు ,ఉల్లిగడ్డ లు ,పచ్చి కాయలు , దొండకాయలు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ఎన్. ఎం .ఎం యువసేన ఆధ్వర్యంలో ఇలాంటి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పూజారి బిక్షపతి ఎన్. ఎం .ఎం యువసేన సభ్యులు బుషిగారి బిక్షపతి బుషి గారి శ్రీశేలం తదితరులు పాల్గొన్నారు.

0 Comments