Wanted Reporters

Wanted Reporters

చలో హైదరాబాద్ ముదిరాజ్ ల ఆత్మగౌరవ గర్జన సభను విజయవంతం చేయాలి: సర్పంచ్ నాగభూషణం

 చలో హైదరాబాద్ ముదిరాజ్ ల ఆత్మగౌరవ గర్జన సభను విజయవంతం చేయాలి: సర్పంచ్ నాగభూషణం 



మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలoలోని రంగయపల్లి గ్రామ సర్పంచ్ కర్రే నాగభూషణం, మేడ్చల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు అశోక్ ముదిరాజులు పిలుపునిచ్చారు. చట్టసభల్లో ముదిరజులకు ప్రాధాన్యత కల్పించాలని బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను వారు డిమాండ్ చేశారు, అత్యధిక ఓట్లు కలిగిఉన్న ముదురాజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని రాజకీయాల్లో చట్టసభల్లో మాత్రం అవకాశాలు కల్పించడం లేదని మండిపడ్డారు అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు కేటాయించి ముదిరాజుల రాజకీయ అభివృద్ధికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు. పేరుకు రాజులమే తప్ప అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో రాజకీయంగా పెద్దపీట వేయకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అత్యధిక స్థానాల్లో ముదిరాజులను నిలబెట్టి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ముదురాజులను తక్కువచూపు చూస్తే ఆ పార్టీలకు తీవ్ర వ్యతిరేకoగ పనిచేస్తామని వారు అన్నారు, ముదిరాజులు అత్యధికంగా తరలివచ్చి రేపు జరగబోయే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటి నుండి ముదిరాజ్ అన్న, తమ్ముళ్లు, అక్క చెల్లెలు, తరలిరావాలని వారు కోరారు రానున్న కాలంలో ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది చట్టసభల్లో మెజారిటీ సభ్యులు ఉండే విధంగా ముదిరాజ్ కులస్తులు ఏకతాటిపైకి వచ్చి రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని వారు పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Ad Code