*మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు మ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
ములుగు జిల్లా కేంద్రం వాస్తవ తెలంగాణ అక్టోబర్ 30: సమ్మక్క సారల దర్శించుకున్న
బడే నాగజ్యోతి మాట్లాడుతూ నా ములుగు నియోజక వర్గ ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సమ్మక్క సారక్క తల్లుల దీవెనలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
అనంతరం ఎన్నో ఏండ్ల నుండి మన ప్రాంతం ఏవిదంగా ఉండేనో కెసిఆర్ వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందో ఆలోచించుకోండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బి ఆర్ ఎస్ పెట్టిన పథకాలను వద్దు అని కేసులు పెడుతున్నారు పేదలకు లబ్ది జరగడం వారికీ ఇష్టం లేదు ఇప్పుడు ఇవ్వే వద్దు అంటున్నారు రాబోయే రోజులల్లో వాటిని రానిస్తారని ఏమి నమ్మకం అని అన్నారు మహిళలకు పెద్ద పీట వేసింది కెసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పధకాలు ప్రవేశపెట్టిన ప్రతి పేదింటి బిడ్డకు ఆసరగా నిలిచింది కెసిఆర్ ప్రతి పక్షాలు చెప్పే మాటలను ఎవరు నమ్మకూడదు అని రాబోయే రోజులల్లో కెసిఆర్ గెలిస్తే గ్యాస్ బండ 400 కే ఇస్తా అని మాట ఇచ్చారు. మాటే ఇస్తే తప్పని నైజం మన కెసిఆర్ ది కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను అని అన్నారు.
కార్యక్రమం లో మండల ఇంచార్జీ సంబరి సమ్మరవు, మండల పార్టీ అధ్యక్షులు,దండుగుల మల్లయ్య, గ్రామ సర్పంచ్,గ్రామ అధ్యక్షులు,వార్డు సభ్యులు,సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

0 Comments