నీలం మధు చే ఆర్థిక సహాయం అందజేత
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన గుర్రాల అనసూయ అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక ఎల్లమ్మ యువసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ యువసేన నాయకులు బాధితులు పాల్గొన్నారు.

0 Comments