నిరుపేదలకు బట్టల పంపిణీ అభినందనీయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,వాస్తవ తెలంగాణ/డిసెంబర్ 01:
క్రిస్మస్ మాసం పురస్కరించుకొని నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని పునరుజ్జీవం ట్రస్ట్, ఫెయిత్ టెంపుల్ సంయుక్తంగా నెలరోజులపాటు నియోజకవర్గ పరిధిలోని నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. తొలి రోజైన బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మైనారిటీ ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గం పరిధిలోనీ వెయ్యి మంది నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి పాస్టర్ ప్రశాంత్ తెలిపారు.
0 Comments