ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం టిఆర్ఎస్ జిల్లా యువత విభాగం అధ్యక్షులు వెంకటేశం గౌడ్
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్;-
ఈ నెల 24 న రాష్ట్ర ఐటి పురపాలక శాఖామంత్రి తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ ఆషాకిరణం కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టిఆర్ఎస్ జిల్లా యువత విభాగం అధ్యక్షులు వెంకటేశం గౌడ్ జిన్నారం మండల కేంద్రంలో ఒక ప్రకటనలో తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులకు,పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు,యువకులకు ప్రతి ఒక్కరు పాల్గొని మూడు మొక్కలు నాటాలని సూచించారు నాటిన మొక్కను కూడా సమీక్షించుకోవాలని అన్నారు .

0 Comments