హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-( మే06)
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్ పర్సన్ల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన పార్టీ అధినేత సీల్డ్ కవర్లో పరిశీలకులకు అందించారు. రేపు ఎన్నిక సమయంలోనే పేర్లను ప్రకటించనున్నారు. వరంగల్ మేయర్గా గుండు సుధారాణి, ఖమ్మం ఛైర్ పర్సన్గా నీరజ పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సిద్దిపేట మున్సిపాలిటీకి కడదర్ల మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్ లేదా శైలజకు చైర్ పర్సన్ కుర్చీ దక్కే అవకాశం ఉందని తెరాస శ్రేణులు భావిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ స్థానాలకు చాలా మంది పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మేయర్, ఛైర్ పర్సన్ల ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు చేపట్టనున్నారు. వరంగల్కు మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి; ఖమ్మంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, నూకల నరేశ్ రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. కొత్తూరుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నకిరేకల్కు రవీందర్ రావు, సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలకులుగా ఉన్నారు. అచ్చంపేటకు మంత్రి నిరంజన్రెడ్డి, జడ్చర్లకు మారెడ్డి శ్రీనివాస్రెడ్డిని పార్టీ అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది. రేపు ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశమై సీల్డ్ కవర్లు తెరిచి అధిష్ఠానం ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను పరిశీలకులు వెల్లడించనున్నారు

0 Comments