అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని: ఈటల రాజేందర్
తెలంగాణ సాక్షి న్యూస్:-
ప్రగతిభవన్లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే
అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తనపై
చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.
‘‘2014 వరకే కేసీఆర్.. ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. తెలంగాణ గాంధీగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎవరివో తప్పుడు సలహాలు, నివేదిక వల్ల నాపై కక్ష
సాధిస్తున్నారు. నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నవారంతా నా సహచరులే. నేను ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. కేసీఆర్ తర్వాత
ఆయన కుమారుడే సీఎం కావాలని అన్నాను’’ అని ఆయన చెప్పారు.

0 Comments