ఎల్ ఆర్ ఎస్ బలవంతపు చర్యలు వద్దు..తెలంగాణ ప్రభుత్వాన్నికి హైకోర్టు ఆదేశం
తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్28:-
హైదరాబాద్: సుప్రీం కోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో తేలే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు అనధికార లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఎల్ఆర్ఎస్పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుప్రీంలో పెండింగ్లో ఉన్నందున తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని , విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది
0 Comments