తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం లో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
కూకట్ పల్లి (వాస్తవ తెలంగాణ )
కూకట్ పల్లి నియోజకవర్గం,మూసాపేట్ డివిజన్,గూడ్స్ షేడ్ రోడ్డు,రాయల్ ఫంక్షన్ హల్ లో తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ఈ సందర్భంగా ప్రేమ కుమార్
మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉంటూ అన్ని సామాజిక వర్గాలు వారిని
గౌరవించుకుంటూ పోతే రాజ్యాధికారం దక్కుతుందని చెప్పారు.కూకట్ పల్లి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అని .ఈసారి అందరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు.అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నరు .
ఈ కార్యక్రమంలో డాక్టర్ గేదల శీను బాబు,బోలిశెట్టి శ్రీనివాస్,బాబీ, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్,బాశెట్టి నరసింగరావు,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జల్లు హేమ సుందర్,జాతీయ కాపు అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, ప్రసాద్,పోలోకి కిషోర్ కుమార్,కలమట గోపీనాథ్,పోరెడ్డి యోగేశ్వరరావు,కొల్లి వెంకట్,కమిటీ సభ్యులు,బిజెపి నాయకులు,జనసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

0 Comments