హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: దేవరయాంజల్ భూముల దర్యాప్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎప్పట్నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడే తొందర ఎందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకని, కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్లతో విచారణ జరపడం అవసరమా? అని నిలదీసింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది

0 Comments