కరోనా వాక్సిలేషన్ 45 ఏళ్లు దాటిన వారికే
హైద్రాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారికే మాత్రమే కరోనా టీకాలు వేస్తామని ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు ప్రకటించారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి టీకాలు వేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీలోని ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు

0 Comments