Wanted Reporters

Wanted Reporters

ఈటల రాజేందర్ పై వార్తలు అవాస్తవం--బీసీ నాయకుడి మద్దతుగా బొంతపల్లి లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు

 ఈటల రాజేందర్ పై వార్తలు అవాస్తవం


--బీసీ నాయకుడి మద్దతుగా బొంతపల్లి లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు



గుమ్మడిదల, తెలంగాణ సాక్షి  న్యూస్:

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల బొంత్తపల్లి కమాన్ వద్ద మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా చేశాడని,అసత్య ఆరోపణలు నేపం తో మంత్రి వర్గం నుండి కెసిఆర్ తోలిగిచడం బిసిలను, అనగదోక్కడమేనని  గుమ్మడిదల మండలం ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం  రోజు  ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు కు,నిరసనగా భారీ ఎత్తున ధర్నా చేపట్టారు ఈటల జిందాబాద్ కెసిఆర్ డౌన్ డౌన్ నినాదాలతో మరుమొగాయి. ధర్నా తోహైదరాబాద్ -మెదక్  ప్రధాన రహదారి కావడం తో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మట్లాడుతూ ఈటెల రాజేందర్ తెలంగాణ  ఉద్యమం లో అలుపు ఎరుగని పోరాటం చేసిన నాయకుడని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని, టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పశ్నించినందుకే,  ఈటల పై కక్ష గట్టి మంత్రి పదవి  తొలగించారని, కుట్రతోనే మీడియా లో తప్పుడు  వార్త కథనాలు ప్రచురిస్తున్నయని కెసిఆర్ కు బిసి బుద్ధి చెప్పే రోజులు దగ్గర లోనే వున్నయని, కెసిఆర్  తెలంగాణ బిసి సమాజానికి  మరియు ముదిరాజ్ సమాజానికి  చేసి తప్పును సరిదిద్దుకోని క్షమాపణ చెప్పాలని,లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ముదిరాజ్ మీడియా ఇన్చార్జ్ శ్రీనివాస్ గుమ్మడిదల ముదిరాజ్ సంఘం  అధ్యక్షులు గ్యారల మల్లేష్, ఉప అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చింతల వీరేష్, మండల సలహాదారులు జింక గోపాల్, చింతల రామకృష్ణ, వీరారెడ్డి పల్లి స్వామి, టి. వీరేష్, ఉప్పరి వెంకటేష్, ఉప సర్పంచులు మొగులయ్య, దయానంద్, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు,డి. నర్సింలు,రాజు,సత్యనారాయణ,వీరాస్వామి, రాములు,మహేష్, మహంకాళి,శంకర్,శేఖర్,దొమడుగు రామకృష్ణ,హరికృష్ణ, రాజు,అశోక్,బిక్షపతి, మరియు వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments

Ad Code