యూ జీ డీ పనులకు చైర్పర్సన్ శంకుస్థాపన
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ లో అండర్ డ్రైనేజీ పనులను గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ రోజా బాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 11, 22 వార్డులలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ తో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ నిధులతో వార్డులో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు ప్రమీల శ్రీకాంత్ యాదవ్, స్థానికులు పాల్గొన్నారు.

0 Comments