మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం-ఎమ్మెల్యే పోదెం వీరయ్య.
వాస్తవ తెలంగాణ ప్రతినిది (నుగూరు)వెంకటాపురం, సెప్టెంబర్ 20: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబకా గ్రామంలో ఇటీవల మరణించిన కొండగట్ల ఐలయ్య, సుంకర మురళి ,కోనే శ్రీను ,నరసింహమూర్తి, కుటుంబాలను భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పరామర్శించారు.వారి కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్రావు, వెంకటాపురం వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు .

0 Comments